విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న మహా కుంభాభిషేకం–2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, ఘాట్ రోడ్డు, యాగశాల ప్రాంతాలను తనిఖీ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో లోటు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, తోపులాటలు నివారించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విమాన గోపురం, రంగుల పనులు పూర్తయ్యాయని ఆలయ అధికారులు వివరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.
Comments
Sign in with Google to comment.