వైకాపా ప్రభుత్వ కాలంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వాలని బండ్ల గణేష్ మొక్కుకున్నట్టు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మొక్కును తీర్చుకునేందుకు షాద్నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రగా ఈ సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. శ్రీవారి కృప వల్ల తన సంకల్పం నెరవేరిందని, అందుకే ఈ భక్తి ప్రస్థానం కొనసాగించానని బండ్ల గణేష్ తెలిపారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఆయన చంద్రబాబు నాయుడిని కలిసి తిరుమల ప్రసాదాన్ని అందజేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం కోసం చేసిన మొక్కు తీర్చుకున్న బండ్ల గణేష్
నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పూర్తి చేసి తిరుమలలో శ్రీవారిని దర్శించి చంద్రబాబుకు ప్రసాదం అందజేశారు.
Comments
Sign in with Google to comment.