వేసవి సెలవులు, ఆదివారం నేపథ్యంలో మరియు లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో దేవస్థానం ఈఓ సీనా నాయక్ ఆలయ పరిసరాల్లో విస్తృతంగా పర్యటించి, ఘాట్ రోడ్, క్యూ లైన్లు, రవాణా వ్యవస్థ, దర్శన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాల వద్ద మజ్జిగ, నీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.
కొండపైకి భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు రవాణా వ్యవస్థను కూడా పర్యవేక్షించారు. భారీ రద్దీ కారణంగా నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, తరువాత తిరిగి ప్రారంభించారు.
తదుపరి హుండీ లెక్కింపు కార్యక్రమం మే 18, 2026న మహామండపం 6వ అంతస్తులో నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
Comments
Sign in with Google to comment.