శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం లో శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి కాలం కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతరం ఎండ తీవ్రత మరింత పెరగడంతో భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఆలయ సంప్రదాయాలు మరియు భక్తుల రద్దీ నియంత్రణ దృష్ట్యా ఉదయం 10:30 గంటలకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు తిరిగి అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించి భక్తులను అనుమతించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్వయంగా ఆలయ క్యూలైన్లను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.
దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఎండల దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, మజ్జిగ అందించాలని, అలాగే ఎండ నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ దర్శనం త్వరగా పూర్తయ్యేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈఓ స్పష్టం చేశారు.
Comments
Sign in with Google to comment.