నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున శనివారం సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు.
దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి తరఫున కామాక్షి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమలు, ప్రసాదాలను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు దేవస్థాన సంప్రదాయ మర్యాదలతో దుర్గగుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందాన్ని సత్కరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి అర్చక బృందం కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. రెండు ప్రముఖ శక్తిపీఠాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
Comments
Sign in with Google to comment.