ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
భక్తుల భద్రత, వసతులు, పరిశుభ్రత, అన్నప్రసాద నాణ్యతతో పాటు ఆలయ నిబంధనల అమలును స్వయంగా పరిశీలించారు. రాజగోపురం ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అన్నప్రసాద భవనం, ప్రథమ చికిత్స కేంద్రం, తాగునీరు, మరుగుదొడ్లు, సమాచార కేంద్రం తదితర విభాగాలను పరిశీలించిన ఈవో, భక్తులకు పారదర్శకంగా మరియు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.