Latest
పోకిస్థాన్‌లో ఉన్మాదం: లండన్‌లో మిర్‌పురి ముస్లింలు పాకిస్థాన్ హై కమిషన్ ముందు నిరసన తెలిపారు. who-leaked-the-case-details-questions-mount-over-meenakshi-natarajan-nomination కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడిన తర్వాత ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని ఆరోపించింది. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. పోకిస్థాన్‌లో ఉన్మాదం: లండన్‌లో మిర్‌పురి ముస్లింలు పాకిస్థాన్ హై కమిషన్ ముందు నిరసన తెలిపారు. who-leaked-the-case-details-questions-mount-over-meenakshi-natarajan-nomination కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడిన తర్వాత ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని ఆరోపించింది. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తుల రద్దీ.. వేసవి ఎండల్లో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

ఇంద్రకీలాద్రిపై భక్తుల భారీ రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు, ఉచిత తాగునీరు, అన్నదానంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించిన అధికారులు.

AP/SOUTH

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక గణనీయంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌లు క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

రద్దీ అధికంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం వేగవంతంగా, సులభంగా లభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం సరికొత్త నీటి సరఫరా విధానాన్ని అమలు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు.

ఈ వినూత్న ఏర్పాటుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎండలో నిలబడి ఉన్న తమకు లైన్లలోనే తాగునీరు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు.

మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుంటూ తక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది క్యూ లైన్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా నిర్వహించారు. పాలకమండలి, అధికారుల సమన్వయం మరియు సిబ్బంది కృషి ఫలితంగా భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా సాగింది. ఆలయ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సందర్శకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. పోకిస్థాన్‌లో ఉన్మాదం: లండన్‌లో మిర్‌పురి ముస్లింలు పాకిస్థాన్ హై కమిషన్ ముందు నిరసన తెలిపారు.
  2. who-leaked-the-case-details-questions-mount-over-meenakshi-natarajan-nomination
  3. కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడిన తర్వాత ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని ఆరోపించింది.
  4. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు.
  5. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  6. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  7. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  8. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  9. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  10. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Comments

Sign in with Google to comment.