Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన ‘యోగాంధ్ర’ కార్యక్రమం

ఇంద్రకీలాద్రిపై యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభం.. జూన్ 21 వరకు ఉచిత యోగా శిక్షణలో పాల్గొనాలని భక్తులకు పిలుపు.

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం “యోగాంధ్ర” ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు శ్రీ గర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, అలాగే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

ఈ వినూత్న కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగ సాధనకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. యోగం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల జూన్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం దేవాలయంలో నిర్వహించే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ ప్రారంభ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదాలు మరియు మంచినీటిని పంపిణీ చేశారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.