ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ మంగళవారం కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర పర్యటనలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవురు శ్రీనివాసరావు ఉపముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. దర్శనం అనంతరం విజయ్ శర్మ ఆలయ అధికారులతో కొద్దిసేపు ముచ్చటించి దేవస్థానం నిర్వహణను అభినందించారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ
ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం పొందారు.
Comments
Sign in with Google to comment.