ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సుదీర్ఘకాలం సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆలయ మహా మండపంలో ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు.
దేవస్థానంలో 30 సంవత్సరాలకు పైగా సేవలందించిన సీనియర్ అసిస్టెంట్ శ్రీ బి. త్రినాధ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. పద్మజ సేవలను ఆలయ అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పి. చంద్రశేఖర్, డాక్టర్ కె. గంగాధర్, ఎం. తిరుమలేశ్వరరావు మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు విధి నిర్వహణలో చూపిన అంకితభావం, దేవస్థానం అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.
వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, నూతన వస్త్రాలను అందజేసి సన్మానించారు.
కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.