విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం లో నేడు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సీనానాయక్ ఆధ్వర్యంలో, ఉప ప్రధాన అర్చకులు శాండిల్య గారు మరియు అర్చక బృందం సమక్షంలో ఆలయ విమాన గోపురంపై శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆవిష్కరించారు.
శాస్త్రోక్త పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య హనుమత్ ధ్వజాలను ప్రతిష్టించడం జరిగింది. భక్తుల రక్షణ, క్షేమానికి చిహ్నంగా భావించే ఈ ధ్వజారోహణ కార్యక్రమం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు సమన్వయంతో పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు.
Comments
Sign in with Google to comment.