Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

చెంచుగూడెములలో మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమం ప్రారంభం

మేకలబండ చెంచుగూడెంలో ‘మా స్వామి మల్లన్న’ కార్యక్రమం శోభాయాత్ర, కల్యాణోత్సవంతో ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

 ఈ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏపిడీ కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని తదితరులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 అనంతరం ఆలయం నుంచి మేకలబండలో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక వరకు ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చెంచు భక్తులు గ్రామ ప్రధాన వీధిని రంగవల్లులతో అలంకరించి శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

కార్యక్రమం సంకల్ప పఠనంతో ప్రారంభమై, మహాగణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, గౌరీపూజ, వరపూజ తదితర వైదిక కర్మలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంగళాష్టకాల మధ్య సుముహూర్తంలో జీలకర్ర-బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పునఃపూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెంచు భక్తులకు శేషవస్త్రాలు (పురుషులకు పంచా-కండువా, మహిళలకు చీర-రవిక) అందజేశారు. ఇదే కార్యక్రమం భాగంగా మే 7న మార్కాపురం జిల్లా చింతలలో కూడా ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.