విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత 18 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు.
ఈ లెక్కింపు ప్రకారం మొత్తం నగదు రూ.3,35,86,637 (మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు) వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనంగా భక్తులు సమర్పించిన బంగారం 302 గ్రాములు, వెండి 3 కిలోల 10 గ్రాములు లభించాయి. ఈ కాలానికి గాను దేవస్థానానికి సగటున రోజుకు రూ.18,65,924 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
హుండీలో విదేశీ దేశాలకు చెందిన కరెన్సీ కూడా లభించింది. అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, కువైట్, ఖతార్, హాంకాంగ్, మారిషస్, కెనడా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు అధికారులు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.