శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించిన హుండీల లెక్కింపులో భారీగా ఆదాయం లభించింది. శనివారం జరిగిన లెక్కింపులో దేవస్థానానికి మొత్తం రూ. 7,19,58,064 నగదు రాబడిగా వచ్చింది.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ మొత్తాన్ని భక్తులు గత 30 రోజుల కాలంలో, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు హుండీలలో సమర్పించారు. ఇక హుండీలలో 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 6 కిలోల 550 గ్రాముల వెండి కూడా లభించాయి. విదేశీ కరెన్సీ రూపంలో 624 అమెరికా డాలర్లు, 210 యూఏఈ దిర్హమ్స్, సౌదీ రియాల్స్, సింగపూర్ డాలర్లు, ఇంగ్లాండ్ పౌండ్స్, యూరోలు, కెనడా డాలర్లు, కువైట్ దినార్ తదితర నాణేలు కూడా లెక్కింపులో బయటపడ్డాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు.
కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.