Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

శ్రీశైల దేవస్థానంలో ఆరుద్రానక్షత్రం సందర్భంగా శ్రీస్వామి-అమ్మవార్ల స్వర్ణరథోత్సవం

శ్రీశైల దేవస్థానంలో ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీస్వామి-అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు.

Devotional/Cultural

ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో గురువారం శ్రీస్వామి-అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

 ఆరుద్రోత్సవంలో భాగంగా ఆలయంలో తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, అలాగే విశేష పూజలు నిర్వహించారు.

 అనంతరం ఆలయ ఆవరణలో స్వర్ణరథోత్సవాన్ని ఘనంగా జరిపించారు. రథోత్సవానికి ముందు ఆలయ అర్చకులు లోకకల్యాణం కోసం ప్రత్యేక సంకల్పం చేశారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, అతివృష్టి-అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులు దూరమవ్వాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు.

 అలాగే ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు వంటి అనర్థాలు జరగకుండా ఉండాలని వేదోచ్ఛారణల మధ్య సంకల్ప పఠనం నిర్వహించారు. తదనంతరం రథారూఢులైన శ్రీస్వామి-అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, భక్తుల శివనామస్మరణ మరియు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం సుమారు 7.30 గంటలకు స్వర్ణరథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఘనంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు వంటి పలు జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.