శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానంలో రేపు మార్చి 27, శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖామాత్యులు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని ఆలయ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అలాగే స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవానికి హాజరు కావలసిందిగా ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి యన్. లావణ్య, ధర్మకర్తలు దిండు ప్రవీన్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, జునుంపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, పూల నాగరాజు, శ్రీమతి కె. కవిత, నారాయణ్ దుర్గా రెడ్డి, అలాగే ఆలయ వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.