ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్నారు.
గురువారం రాత్రి 8:15 గంటలకు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి అచ్చెన్నాయుడు దంపతులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది.
Comments
Sign in with Google to comment.