Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

ఆధ్యాత్మికం, ఆహ్లాదం, అభివృద్ధి సమ్మేళనంగా ఇంద్రకీలాద్రి తీర్చిదిద్దే దిశగా అడుగులు

ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మికం, పచ్చదనం, అభివృద్ధి కలిసిన పర్యావరణ హిత క్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

Devotional/Cultural

ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత, ఆహ్లాదం, అభివృద్ధి కలిసిన అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ (ADC) చైర్‌పర్సన్ లక్ష్మి పార్ధసారధి భాస్కర్ ఆదేశాలతో ప్రత్యేక నిపుణుల బృందం గురువారం ఇంద్రకీలాద్రిని సందర్శించింది.

 హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘కన్హ శాంతివనం’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణులు డాక్టర్ రమాకాంత్, శరవణన్, శరత్ లతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ ఈ బృందంలో ఉన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను అందించేలా కొండపై పచ్చదనాన్ని పెంపొందించడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ ఈవో శీనా నాయక్ తో కలిసి నిపుణుల బృందం పలు ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించింది.

 ఇందులో శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలు, కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఉన్న మార్గం, ఘాట్ రోడ్ రిటైనింగ్ వాల్ నుంచి ప్రధాన ఆలయం వరకు ప్రాంతం, అలాగే ఘాట్ రోడ్ దిగువ ప్రాంతం మరియు మౌనస్వామి ఆలయం వెనుక భాగం ఉన్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ఆలయ ఈవో శీనా నాయక్ నిపుణుల బృందానికి వివరించారు.

ఈ ప్రణాళికలో భాగంగా ఇంద్రకీలాద్రిని పర్యావరణ హిత ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు నిపుణుల బృందం తమ సూచనలను అందించనుంది. అత్యున్నత ప్రమాణాలతో ఇంద్రకీలాద్రి రూపురేఖలను మార్చి, భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యమని బృంద సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి, దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సంయుక్తంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.