ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన ఎన్ ఐ ఆర్ ఎమ్ బృందం, విజయవాడకు చెందిన ఎస్ పి ఏ అధికారులు, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం వంటి నిర్మాణాల పురోగతిపై చర్చించి, ఘాట్ రోడ్ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ కొండలరావు బృందం అమ్మవారిని దర్శించుకోగా, ఈవో శీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన, సులభ దర్శనం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ అమలులో ఎన్ఐఆర్ఎం,ఎస్ పి ఎ బృందాల నివేదికలు కీలకంగా మారనున్నాయని వెల్లడించారు.
Comments
Sign in with Google to comment.