Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం: కీలక నిర్ణయాలు ఆమోదం

శ్రీశైలం ధర్మకర్తల సమావేశంలో 22 అజెండాలు చర్చించి, అభివృద్ధి పనులు, శౌచాలయాలు, రోడ్లు, డ్రైనేజీ, డార్మిటరీలు, భక్తుల సౌకర్యాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో ధర్మకర్తల మండలి 6వ సమావేశం మంగళవారం నిర్వహించబడింది. దేవస్థానం కార్యాలయ భవనంలోని మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో మండలి అధ్యక్షుడు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు శ్రీ బోడేపూడి వెంకటసుబ్బారావు, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సహా పలువురు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 22 అజెండా అంశాలను చర్చించగా, వాటిలో 15 అంశాలకు ఆమోదం లభించింది. ఐదు అంశాలను వాయిదా వేయగా, రెండు అంశాలను తిరస్కరించారు. సమావేశం ప్రారంభంలో అధ్యక్షుడు మాట్లాడుతూ, క్షేత్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసి, వారికి పూర్తి సంతృప్తి కలిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. ముఖ్య నిర్ణయాలుగా క్షేత్ర పరిధిలో భక్తుల రద్దీ ఉన్న 20 ప్రదేశాల్లో బి.ఓ.టి విధానంలో శాశ్వత ప్రజా శౌచాలయాలను నిర్మించాలని తీర్మానించారు. ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. టోల్ గేట్ నుంచి కుమారసదనం వరకు రూ. 24 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. వర్క్‌షాప్ నుంచి పాతాళగంగ పాత మెట్ల వరకు రూ. 36.5 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

 దేవస్థానం గో సంరక్షణశాలలో గోవులకు అవసరమైన గడ్డి సరఫరాకు సంబంధించిన టెండర్‌కు ఆమోదం లభించింది. అలాగే సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త శాఖ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుత డార్మిటరీలను ఆధునీకరించడంతో పాటు కొత్త డార్మిటరీలను నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

 పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో కనీసం ఆరు వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.