ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సి.జె. కుటుంబానికి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థానం ఈఓ వి.కే. సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి హారతి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్, అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ కుటుంబానికి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేయగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
Comments
Sign in with Google to comment.