Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి ఘనంగా పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి నుంచి అన్నవరం సత్యదేవునికి పట్టువస్త్రాల సమర్పణ, కళ్యాణోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో, అధికారుల సమక్షంలో వైభవంగా నిర్వహణ

Devotional/Cultural

అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి పట్టువస్త్రాలను ఆదివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు.

 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు, అర్చకులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టువస్త్రాలతో అన్నవరం చేరుకోగా, రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.

 మంగళవాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టువస్త్రాలు, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం, అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఇంద్రకీలాద్రి బృందానికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పరస్పరం పంచుకున్నారు.

కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, సిబ్బంది ఎం. జయప్రకాష్ (జెపి), కె. లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవ వేళ ఇంద్రకీలాద్రి అమ్మవారి పట్టువస్త్రాల సమర్పణ, ఈ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా ప్రతిబింబించింది.

 

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.