విజయవాడ: ఇంద్రకీలాద్రిపై లీజుదారులపై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఈఓ వి.కే. సీనా నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆలయ ప్రాంగణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న లీజుదారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి నిబంధనలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దుకాణాల నిర్వహణ సమయాలు, ధరల పట్టిక ప్రదర్శన, సిబ్బంది పూర్తి వివరాలు, ఐడీ కార్డుల వినియోగం, క్రమశిక్షణ, టెండర్ నిబంధనల అమలు తప్పనిసరిగా పాటించాలని ఈఓ ఆదేశించారు.
భక్తులతో దురుసు ప్రవర్తన, అధిక వసూళ్లు, అనుమతి లేకుండా దుకాణాల విస్తరణ వంటి ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కఠిన నియమాలు అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Comments
Sign in with Google to comment.