Latest

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. ‘పవర్ బ్రోకర్లదే పెత్తనం’ అంటూ క్యాడర్ ఫైర్!

తెలంగాణ కాంగ్రెస్‌లో కార్యకర్తల అసంతృప్తి పెరుగుతోందా? పాత క్యాడర్‌ను పక్కనపెట్టి కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు పార్టీకి కొత్త సవాలుగా మారుతున్నాయి.

Telangana/karnataka

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ యువతలో భావోద్వేగం nu గమనించి చాలామంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించిన ఇచ్చిన మాటకు కట్టుబడి గాంధీ తెలంగాణ రాష్టం ఏర్పాట్ద్క అప్పట్లో అధికారంలో ఉన్న సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తీవ్ర నిరాశను మిగిల్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో క్రమంగా బలహీనపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. 2018 లొ ఎన్నికల్లోనూ పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై పార్టీలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆ పరిణామాలను అడ్డుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న విమర్శలు కాంగ్రెస్ క్యాడర్‌లో బలంగా వినిపించాయి

. ఒక దశలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ తీవ్రంగా వెనుకబడింది.

ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆయన దూకుడైన ప్రసంగాలు, ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌లో మళ్లీ కదలిక తీసుకొచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి .

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు గణనీయమైన మద్దతు లభించింది. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు మంచి రోజులు వస్తాయని ఆశించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని పలువురు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ‘పవర్ బ్రోకర్లదే పెత్తనం’.. కార్యకర్తల తీవ్ర ఆరోపణలు

 కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో జర్నలిస్టులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజా ఉద్యమాలతో అనుబంధం ఉన్న వర్గాలు తమ వంతు పాత్ర పోషించాయని కాంగ్రెస్ అనుకూల వర్గాలు గుర్తుచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిర్ణయాల విషయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని కొందరు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి మరింత అయోమయంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను మోసిన వారిని పక్కనపెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కొన్ని నియోజకవర్గాల్లో బయటపడుతోంది. ‘మళ్లీ అంత కష్టపడి పనిచేయాలా?’. . క్యాడర్‌లో పెరుగుతున్న ప్రశ్న అధికారంలోకి తీసుకురావడానికి తమ శక్తిమేరకు పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు, పదవులు, రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన అసలైన క్యాడర్ ఎవరు? ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులు ఎవరు? అనే ప్రశ్నలు కార్యకర్తల్లో తలెత్తుతున్నాయి

. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గతంలో ఉన్నంత ఉత్సాహంతో పనిచేయడం కష్టమవుతుందని కొందరు కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే పార్టీకి బలం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్యకర్తలు ఎందుకు దూరమవుతున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నాయకత్వం ఈ అసంతృప్తిని ఎంత త్వరగా గుర్తించి, క్షేత్రస్థాయి క్యాడర్‌కు మళ్లీ ప్రాధాన్యత ఇస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. లేకపోతే 2023లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో క్యాడర్ అసంతృప్తి కాంగ్రెస్‌కు కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముంది.

Related Stories

Latest Articles

  1. Telangana Congress in Turmoil: Factional War Erupts, Revanth Reddy Camp Goes on High Alert
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. A couple who went to the forest for solitude were shocked when a young man sustained severe injuries from torn electric wires.
  5. Hyderabad Supercar Crash: Crores-Worth Luxury Car Claims Woman’s Life, MP’s Son Booked
  6. Free Mass Varalakshmi Vratham to Be Held at Srisailam
  7. Chandrasekhar Azad Inspects Prasadam and Anna Danam Facilities at Annavaram
  8. Devotee Donates Gold Jewellery Worth ₹21 Lakh to Vijayawada Durga Temple
  9. Endowments Commissioner Reviews Final Works at Indrakeeladri Temple
  10. EO V.K. Sheena Naik Invites Senior District Officials to Inauguration of Prasadam Bhavan
Comments

Sign in with Google to comment.