Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రి దేవాలయంలో భారీగా భక్తుల రద్దీ.. వేసవి ఎండల్లో ప్రత్యేక సౌకర్యాలు

ఇంద్రకీలాద్రి దేవాలయంలో ఆదివారం భారీ భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక సౌకర్యాలతో భక్తులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు.

AP/SOUTH

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రి దేవాలయంపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

 వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల VIP దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా లభించింది.

 వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని భక్తులకు అందించారు.

 ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

అసిస్టెంట్ కమిషనర్ రంగా రావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాలకమండలి, అధికారుల సమన్వయంతో భారీ రద్దీ మధ్య కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.