Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

చెంచుగూడెములలో మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమం ప్రారంభం

మేకలబండ చెంచుగూడెంలో ‘మా స్వామి మల్లన్న’ కార్యక్రమం శోభాయాత్ర, కల్యాణోత్సవంతో ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

 ఈ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏపిడీ కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని తదితరులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 అనంతరం ఆలయం నుంచి మేకలబండలో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక వరకు ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చెంచు భక్తులు గ్రామ ప్రధాన వీధిని రంగవల్లులతో అలంకరించి శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

కార్యక్రమం సంకల్ప పఠనంతో ప్రారంభమై, మహాగణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, గౌరీపూజ, వరపూజ తదితర వైదిక కర్మలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంగళాష్టకాల మధ్య సుముహూర్తంలో జీలకర్ర-బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పునఃపూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెంచు భక్తులకు శేషవస్త్రాలు (పురుషులకు పంచా-కండువా, మహిళలకు చీర-రవిక) అందజేశారు. ఇదే కార్యక్రమం భాగంగా మే 7న మార్కాపురం జిల్లా చింతలలో కూడా ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.