Latest
ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.

చెంచుగూడెములలో మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమం ప్రారంభం

మేకలబండ చెంచుగూడెంలో ‘మా స్వామి మల్లన్న’ కార్యక్రమం శోభాయాత్ర, కల్యాణోత్సవంతో ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

 ఈ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏపిడీ కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని తదితరులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 అనంతరం ఆలయం నుంచి మేకలబండలో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక వరకు ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చెంచు భక్తులు గ్రామ ప్రధాన వీధిని రంగవల్లులతో అలంకరించి శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

కార్యక్రమం సంకల్ప పఠనంతో ప్రారంభమై, మహాగణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, గౌరీపూజ, వరపూజ తదితర వైదిక కర్మలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంగళాష్టకాల మధ్య సుముహూర్తంలో జీలకర్ర-బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పునఃపూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెంచు భక్తులకు శేషవస్త్రాలు (పురుషులకు పంచా-కండువా, మహిళలకు చీర-రవిక) అందజేశారు. ఇదే కార్యక్రమం భాగంగా మే 7న మార్కాపురం జిల్లా చింతలలో కూడా ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Related Stories

Latest Articles

  1. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు.
  2. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  3. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  4. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  5. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  6. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  7. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  8. ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ వీకే శీనా నాయక్ తెలిపారు.
  9. చలించు రైలులో నుండి పడిన ప్రయాణికుడిని అప్రమత్తమైన రైలుజనులు కాపాడారు.
  10. ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ
Comments

Sign in with Google to comment.