Latest
ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.

శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం దర్శనం, నీటి, భద్రతా, అన్నప్రసాద సౌకర్యాలు పూర్తిగా సిద్ధం

శ్రీశైలం ఉగాది ఉత్సవం కోసం భక్తుల సౌకర్యం, దర్శనం, క్యూలైన్, నీటి, భద్రతా, అన్నప్రసాద అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

 మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూకాంప్లెక్సులు మరియు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. అలాగే క్యూకాంప్లెక్సుల్లో ఫ్యాన్లు, కూలర్లు సక్రమంగా పనిచేసేలా ఎలక్ట్రికల్ విభాగం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, దర్శనం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఆదేశించారు.

 ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  2. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  3. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  4. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  5. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  6. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  7. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  8. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
  9. శ్రీశైల దేవస్థాన సేవలకు వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సన్మానం
  10. ఓవైసీ పాకిస్తాన్ సంబంధాలపై బీజేపీని లక్ష్యంగా చేసారు, రామ్ మాధవ్‌పై ప్రశ్నలు వేస్తున్నారు.
Comments

Sign in with Google to comment.