Latest

PM మోదీ చేతుల మీదుగా భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. గ్రీన్ రైల్ యుగానికి శ్రీకారం

భారత్ తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ హర్యానాలో ప్రారంభించారు. జింద్-సోనిపట్ మార్గంలో నడిచే ఈ రైలు గ్రీన్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

India

జింద్ (హర్యానా), జూలై 17: ప్రధానమంత్రి Narendra Modi శుక్రవారం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో భారత్ తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో స్వచ్ఛమైన, పర్యావరణహిత రవాణా దిశగా భారత రైల్వేలు మరో కీలక అడుగు ముందుకు వేసాయి.

జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు సేవలు అందించనుంది. సంప్రదాయ డీజిల్ లేదా విద్యుత్ ఆధారిత రైళ్లకు భిన్నంగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా ఈ రైలు స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుండటంతో ఇది దాదాపు సున్నా కాలుష్య ఉద్గారాలతో పనిచేస్తుంది

భారతీయ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ 10 కోచ్‌ల రైలు, అధునాతన భద్రతా వ్యవస్థలతో సన్నద్ధమైంది. హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగలను గుర్తించే ప్రత్యేక సెన్సర్లు ఇందులో అమర్చారు. జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టుతో జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల సరసన హైడ్రోజన్ రైలు సాంకేతికతను అమలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరింది. దేశాన్ని కార్బన్ ఉద్గారాల రహిత రవాణా వ్యవస్థ వైపు తీసుకెళ్లడంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Related Stories

Latest Articles

  1. Telangana Politics Heats Up: BRS’s Opposition Strategy Under Fire
  2. కాంగ్రెస్‌ను కూల్చాలనుకుని.. బీఆర్‌ఎస్‌కే కౌంటర్! అసెంబ్లీ రచ్చ నుంచి కేటీఆర్ మాక్‌ సభ వరకు ఇదేంటి రాజకీయం?
  3. Telangana’s New Education Policy to Target Gen Alpha, Gen Beta: Revanth Reddy
  4. Not a Congress Leader: Conman Posing as Rahul Gandhi’s Aide Held
  5. No More Toll Booth Stops? Gadkari Pushes Barrier-Free Tolling by 2027
  6. Ex-Havildar Held in Secunderabad Army Weapons Theft Case
  7. America Marks 25th Anniversary of 9/11 Attacks
  8. .‘Gen-Z Is Watching’: Chandrababu Warns Officials Over Public Neglect
  9. Modi-Putin Meeting: India-Russia Partnership Poised for Significant Advancement
  10. Rashmika Mandanna Calls on India’s Young Talent to Believe Big and Seize the Moment
Comments

Sign in with Google to comment.