Latest

కాంగ్రెస్‌ను కూల్చాలనుకుని.. బీఆర్‌ఎస్‌కే కౌంటర్! అసెంబ్లీ రచ్చ నుంచి కేటీఆర్ మాక్‌ సభ వరకు ఇదేంటి రాజకీయం?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ హంగామా, సభ్యుల సస్పెన్షన్‌, కేటీఆర్‌ మాక్‌ అసెంబ్లీపై రాజకీయ దుమారం. ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు.

Politics

హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. 2023 ఎన్నికల పరాజయం నుంచి ఇంకా బయటపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలు వరుసగా రాజకీయ పోరాటాలకు దిగుతున్నప్పటికీ, ప్రజా సమస్యల కంటే రాజకీయ హంగామాకే ప్రాధాన్యం పెరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించడం ప్రధాన బాధ్యత. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే చోటుచేసుకున్న పరిణామాలు ఈ బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తాయి. సభా కార్యక్రమాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో నిరసనలు, ఆందోళనలతో రాజకీయ వేడి పెంచడంపై విమర్శలు వచ్చాయి. ప్రజలు ఆశించిన నిర్మాణాత్మక చర్చకు బదులుగా సభ వెలుపల రాజకీయ ప్రదర్శనలు చోటుచేసుకోవడం బీఆర్‌ఎస్ వ్యూహంపై చర్చకు దారితీసింది.

ఇదే క్రమంలో బహిరంగ ప్రదేశంలో బీఆర్‌ఎస్ నేత లు  టీషర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేయడం, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా రెడ్డి తదితరులతో జరిగిన తోపులాట వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. అయితే ఘటనకు సంబంధించిన దృశ్యాలపై భిన్న వాదనలు వినిపించడంతో రాజకీయ ఆరోపణలు మరింత ముదిరాయి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఇలాంటి ఘటనలపై స్పష్టత ఇచ్చి, అవసరమైతే విచారణకు సహకరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి ఉపయోగించినట్లు చెబుతున్న అనుచిత భాష కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్షాలిద్దరిపైనా ఉందనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై బీఆర్‌ఎస్ నుంచి క్షమాపణ లేదా అంతర్గత సమీక్ష జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సమర్థవంతమైన చర్చకు అవకాశం ఏర్పడేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఆ తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగడంతో బీఆర్‌ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’పై కూడా రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ వెలుపల ప్రత్యామ్నాయ సభ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం తీరును ఎండగట్టాలని బీఆర్‌ఎస్ ప్రయత్నించినప్పటికీ, అది ప్రజా సమస్యలపై పోరాటంగా కనిపించకుండా రాజకీయ ప్రదర్శనగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నంలో బీఆర్‌ఎస్ తన ప్రతిపక్ష పాత్రనే బలహీనపరుచుకుంటోందా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్న వేళ.. బీఆర్‌ఎస్ ప్రజల సమస్యలపై పోరాడి పుంజుకుంటుందా? లేక రాజకీయ హంగామాతోనే కాలం గడుపుతుందా? అన్నది వేచి చూడాలి.

Related Stories

Latest Articles

  1. Telangana Politics Heats Up: BRS’s Opposition Strategy Under Fire
  2. Telangana’s New Education Policy to Target Gen Alpha, Gen Beta: Revanth Reddy
  3. Not a Congress Leader: Conman Posing as Rahul Gandhi’s Aide Held
  4. No More Toll Booth Stops? Gadkari Pushes Barrier-Free Tolling by 2027
  5. Ex-Havildar Held in Secunderabad Army Weapons Theft Case
  6. America Marks 25th Anniversary of 9/11 Attacks
  7. .‘Gen-Z Is Watching’: Chandrababu Warns Officials Over Public Neglect
  8. Modi-Putin Meeting: India-Russia Partnership Poised for Significant Advancement
  9. Rashmika Mandanna Calls on India’s Young Talent to Believe Big and Seize the Moment
  10. Putin Lands in Delhi Today: Modi-Putin Talks Set to Focus on Strategic Ties
Comments

Sign in with Google to comment.